15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆస్ట్రేలియా కాల్పుల ఘటన.. హైదరాబాద్ వ్యక్తి ప్రమేయం అవమానం

17-12-2025 02:01 PM

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో ఇటీవల జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో హైదరాబాద్ వ్యక్తి ప్రమేయం ఉండటం భారతదేశానికి అవమానమే కాకుండా, తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళన కూడా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించగా, ఆ ఘటనలోని అనుమానితులలో ఒకరైన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ అని తెలంగాణ పోలీసులు తెలిపారు. అక్రమ్ ఏ పరిస్థితులలో భారతదేశాన్ని విడిచి వెళ్ళాడు. ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత అతను ఎవరితో సంబంధాలు కొనసాగించాడనే విషయాలపై విచారణ జరపాలని బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ పోలీసులను కోరారు.

ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రవాద చర్యతో హైదరాబాద్‌కు సంబంధం ఉండటం మనకు అవమానకరమైన విషయమే అయినప్పటికీ, ఇది ఒక తీవ్రమైన జాతీయ భద్రతా ఆందోళన కూడా. తెలంగాణ పోలీసులు ఇప్పుడు విచారణ జరిపి, అక్రమ్ భారతదేశాన్ని విడిచి వెళ్ళిన పరిస్థితులు, కారణాల గురించి కూడా లోతుగా దర్యాప్తు చేయాలని రాంచందర్ రావు సూచించారు. ఈ సంఘటన దేశం, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసు విచారణ అవసరం కావచ్చని ఆయన అన్నారు.

దురదృష్టవశాత్తు, ఈ ఘటనలో పాలుపంచుకున్న వ్యక్తులు భారతదేశానికి చెందినవారు, అందులోనూ హైదరాబాద్ వాసులు. వారు 27 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి వెళ్లిపోయినప్పటికీ, హైదరాబాద్‌లో ఇప్పటికీ ఐఎస్‌ఐ,  ఐసిస్ కోసం అనేక స్లీపర్ సెల్స్ ఉన్నాయని తను భావిస్తున్నట్లు రాంచదర్ తెలిపారు.  సాజిద్ అక్రమ్ (50) స్వస్థలం భారతదేశంలోని హైదరాబాద్. అతను హైదరాబాద్‌లో తన బీ.కామ్ డిగ్రీని పూర్తి చేసి, సుమారు 27 సంవత్సరాల క్రితం, 1998 నవంబర్‌లో ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని తెలంగాణ పోలీసులు తెలిపారు. కాల్చి చంపబడిన అక్రమ్ వద్ద ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ ఉంది.