2 September, 2026 | 11:29 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఖమ్మంలో అరుదైన శస్త్ర చికిత్స

27-11-2024 | 04:38am

మెదడులో ఏర్పడ్డ కణతి తొలగింపు 

ఖమ్మం, నవంబర్ 26 (విజయక్రాంతి): ఖమ్మంలోని మమత జనరల్ ఆసుపత్రిలో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన జీ వెంకయ్య(80) గత మూడేళ్లుగా తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో మమత ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.

పరీక్షించిన వైద్యులు చిన్న మెదడు, పెద్ద మెదడుకు మధ్యలో బ్రెయిన్ స్టెమ్‌కు అతుక్కుని కణతి ఉన్నట్టు గుర్తించారు. న్యూరో విభాగం అధిపతి డాక్టర్ జగదీష్‌బాబు  ఆధ్వర్యంలో ఎంతో సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను నిర్వహించి కణతిని తొలగించారు. దీంతో డాక్టర్ జగదీష్‌బాబును మమత మెడికల్ కాలేజీ, మమత ఆసుపత్రి కార్యదర్శి పువ్వాడ జయశ్రీ అభినందించారు. రూ.10 లక్షలకు పైగానే ఖర్చు అయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు.