2 September, 2026 | 10:35 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

మహారాష్ట్ర బాటపట్టిన ఆశావహులు

27-11-2024 | 04:45am

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం ప్రయత్నాలు

కరీంనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి):కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల ప్రచారం రాష్ట్ర సరిహద్దు దాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా సరిహద్దులకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలతోపాటు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఉపాధి కోసం వెళ్లిన పట్టభద్రులను కలిసేందుకు మహారాష్ట్ర బాటపట్టారు. నాందేడ్, చంద్రాపూర్, గడ్చిరోలి, ముంబై, భీవండి ప్రాంతా ల్లో వరుసగా పర్యటిస్తున్నారు.

అక్కడ స్థిరపడ్డ పట్టభద్రులు దాదాపుగా 5 నుంచి 10 వేల మంది ఉన్నారు. వారు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటర్లుగా ఎన్‌రోల్ చేసుకోవ డంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పయనమయ్యారు. ఓటుకు ఓటు ఆసరా అన్నట్లుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అల్ఫోర్స్ విద్యాసం స్థల అధినేత నరేందర్‌రెడ్డి మంగళవారం చంద్రాపూర్‌లో పర్యటించారు.