12 June, 2026 | 11:53 AM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

నష్టపోయిన మొక్కజొన్న రైతులకు రాశి సీడ్ కంపెనీ నష్ట పరిహారం

25-03-2026 07:34 PM

మొక్కజొన్న రైతులకి అండగా నిలిచిన తుడుండెబ్భ నాయకులు

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతుల పక్షాన తుడుందెబ్బ నాయకులు నష్ట పరిహారం చెల్లించాలని పోరాటం చేసిన విషయం తెలిసిందే బుధవారం రోజు రాశి సీడ్స్ కంపెనీ వారు రైతుల పంట సేనులను చూసి పరిశీలించారు. ఎంత మంది రైతులు నష్టపోయినారో ఇదే పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 80వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ వివాదంపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు ఏఓ వేణుగోపాల్, ఏఈఓ రాజు కుమార్ పంట పొలాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరీక్షించి, నష్టం జరిగిన తీరును అంచనా వేశారు. ఈ సందర్భంలో తుడుందెబ్బ నాయకత్వం మాట్లాడుతూ... "ఈ విజయం కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. ఏటూరునాగారం మండలంలో రాశి సీడ్స్‌తో పాటు ఇతర కంపెనీల విత్తనాలు వాడి నష్టపోయిన రైతులందరికీ కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి" అని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రైతులు అందరు కలిసి తుడుం దెబ్బ నాయకులకి తమ పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసారు