26 February, 2026 | 9:29 PM

విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య

26-02-2026 12:46 AM

కోదాడ, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా  పట్టణానికి చెందిన రావెళ్ల సీతారామయ్య ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాదులోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక సందర్భంగా సీతారామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కోదాడ యూనిట్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు.  సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గం అసోసియేట్ అధ్యక్షులుగా నియమిం చినందుకు గాను జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, వీరబాబు, భ్రమరాంబ, జానయ్య, హాజీ నాయక్, యస్ దాని, భిక్షం, నరసయ్య, శోభారాణి, కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.