17-06-2025 07:49:25 PM
మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి..
మంథని (విజయక్రాంతి): కవిగా, ఉపాధ్యాయునిగా రావికంటి రామయ్య గుప్త సమాజానికి అందించిన సేవలు ఆదర్శప్రాయమని మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి(Kondela Maruthi) అన్నారు. మంగళవారం రామయ్య గుప్త 89వ జయంతి సందర్భంగా మంగళవారం మంథనిలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో కొండేల మారుతి ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మారుతి, రాజమౌళి గౌడ్, బోగోజు శ్రీనివాస్, బత్తుల సత్యనారాయణ, రామడుగు మారుతి, నాగమళ్ల కృష్ణ తదితరులు మాట్లాడుతూ... రామయ్య గుప్త సామాజిక సమస్యలపై అక్షరాయుధాలు సంధించారని, అవినీతి అక్రమాలను నిర్భీతితో ఎండగట్టారని, ఉపాధ్యాయుడిగా వేలమందిని తీర్చిదిద్దారని కొనియాడారు.
వారి స్మారకంగా ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంనీయమన్నారు. రామయ్య గుప్త వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని వర్ణిస్తూ పుల్లూరు నాగేశ్వర్ రచించిన పద్యాలను రావికంటి మనోహర్ ఆలపించారు. అనంతరం రామయ్య గుప్త తనయుడు రావికంటి శ్రీనివాస్ ను గట్టు నాగన్న తదితరులు ఘనంగా సన్మానించారు. విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు వంశీ, రమేశ్, ఉపాధ్రక్షుడు కొమురవెల్లి సమ్మయ్య, కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, సుదర్శన్, రావికంటి శ్రీనివాస్, గుండా శైలజ తదితరులు నివాళులు అర్పించి పూలమాలలు సమర్పించారు.