calender_icon.png 30 May, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవీందర్ మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటు

29-05-2025 10:40:44 PM

వరంగల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయుడు కోర గట్ల రవీందర్ మృతి ఉపాధ్యాయ లోకానికి, టిటియు సంఘానికి తీరని లోటు అని టిటియు రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి(TTU State President Manipal Reddy) అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ గుండెపోటుతో మరణించగా గురువారం దశదిన కర్మ సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

రవీందర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రవీందర్ మారుమూల గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేశారని కొనియాడారు. చదువుతూనే అభివృద్ధి సాధ్యమని గిరిజన విద్యార్థులకు అనేక విధాలుగా సహాయం అందించి వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సదానందం, టి టి యు ములుగు జిల్లా అధ్యక్షుడు సర్వ అహ్మద్, టీఎస్ డబ్ల్యూటీయూ జాతీయ కన్వీనర్ పోడెం కృష్ణ ప్రసాద్, ఆదర్శన్ రెడ్డి, బిక్షపతి, నరసింహస్వామి, కోటయ్య, కృష్ణమూర్తి, రమేష్, బుచ్చయ్య, బాబు, ప్రభాకర్, సురేందర్, రాంబాబు, సారంగపాణి, రాజమౌళి, రాజేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.