calender_icon.png 7 June, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన ఆర్‌డీవో

04-06-2025 12:00:00 AM

కల్లూరు జూన్ 03(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల, భూమి యజమాను ల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టం పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుండి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని బతుల్లపల్లి,ముచ్చవరం గ్రామ పంచయతీల్లో భూ భారతి కార్యక్రమంను ఆర్డీవో రాజేంద్ర గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాలలో 12 బృందాలుగా ఏర్పడి గ్రామపంచాయతీ,పాఠశాలల ఆవరణలో  తాహశీల్దార్ ల అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు.మూడో తేదీ నుండి 21వ తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని ఆయా మండలాల్లో డిప్యూటీ తాహశీల్దార్ తాహశీల్దార్ లు రెండు  బృందాలుగా ఏర్పడి రెవెన్యూ సదస్సులలో రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు.

సదస్సులు అనంతరం ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్ ముందు  సాదా బైనామలో దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలిస్తున్నట్లు ఈ సమస్యలు సాధనకు రెవెన్యూ సదస్సులు అనంతరం పరిష్కార మా ర్గాలు చూపిస్తామని  పేర్కొన్నారు. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు ,మండలాల్లో తాహశీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు రెవెన్యూ సదస్సులను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

రైతుల సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే నేరుగా రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ భాగం నీరజ దేవి, తాహశీల్దార్ పులి సాంబశివుడు, డిప్యూటీ తాహశీల్దార్ జంగం బాబ్జి ప్రసాద్, ఆర్‌ఐ లు సుజాత, ఉమామహేశ్వరరావు, బత్తులపల్లి సెక్రెటరీ కోట రాజేశ్వరి, ముచ్చవరం సెక్రటరీ శ్రీనివాసరావు, ఏ ఈ ఓ లు, వైకుంఠ శ్రీనివాసరావు, జంగా పిచ్చి రెడ్డి, ఏసు రెడ్డి, రైతులు తదితరులుపాల్గొన్నారు.