27-10-2025 12:18:14 AM
- గండిడ్ కస్తూర్బా పాఠశాల ఎస్ఓ కు శోకజ్ నోటీస్
- రెవెన్యూ అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
గండీడ్, అక్టోబర్ 26: విద్యపై సంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇలాంటి సమస్యలు ఉన్న తమకు చెప్పాలని జిల్లా రెవెన్యూ అదన కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు రైస్ మిల్లునుఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు రైస్ మిల్లును, లైసెన్సుడు సర్వేర్ల పరీక్ష కేంద్రాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమం తప్పకుండా భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు.
అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓకు షోకస్ నోటీస్ జారీచేయాలని డీఈఓ ప్రవీణ్ ను ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్న నిర్మొహమాటంగా చెప్పాలని సూచించారు. అనంతరం రైస్ మిల్లులో నియమ నిబంధన ప్రకారం ముందుకు సాగాలని ఎలాంటి అవకతవకలు జరిగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.