calender_icon.png 19 June, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దౌత్యవేత్తల పునర్ నియామకం

19-06-2025 01:28:36 AM

- నిర్ణయించిన భారత్, కెనడా ప్రధానులు

- కార్నీకి అభినందనలు తెలిపిన మోదీ

- నిజ్జర్ హత్య ప్రస్తావనకు వచ్చిందా అని ప్రశ్నించిన విలేకరులు

కనానాస్కిస్, జూన్ 18: కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన జీ సదస్సులో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. మార్క్ కార్నీ 2025లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ మధ్య ఇదే మొదటి భేటీ. ఇరు దేశాలకు దౌత్యవేత్తలను పునర్ నియమించేందుకు ఇరువురు ప్రధానులు అంగీకరించారు. దీంతో ఇరుదేశాల పౌరులకు మరిన్ని సేవలు అందనున్నాయి. వీరిరువూ వాణిజ్యం, శక్తి, అంతరిక్షం, కీలక ఖనిజాలు, ఎరువులు, కృతిమ మేధ మొదలయిన అనేక అంశాలపై చర్చించారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఈపీటీఏ)పై తిరిగి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రధాని కార్యాల యం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘భారత్ సంబంధాలు అత్యంత కీలకం. కెనడా కు చెందిన చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. అనేక మంది భారతీయు లు కెనడా గడ్డపై అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణిస్తున్నారు. భారత్ కెనడాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం.. మానవత్వాన్ని మరింత బలోపేతం చేయాలి.

కెనడా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కార్నీతో భేటీ అవడం ఇదే తొలిసారి. ప్రధానిగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నా. ఆయన సారధ్యంలో కెనడాతో మరిన్ని రంగాల్లో భారత బంధం బలపడుతుందని ఆశిస్తున్నా.’ అని వెల్లడించారు.  ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధా ని మోదీ ఎక్స్‌లో భేటీకి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘మార్క్ కార్నీతో అద్భుతమైన సమావేశం జరిగింది.

జీx7 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు కెనడా ప్రభుత్వాన్ని, కార్నీని అభినం దించా. భారత్, కెనడా దేశాలు ప్రజాస్వామ్యంపై బలమైన విశ్వాసం కలిగి ఉన్నాయి. భారత్ స్నేహాన్ని బలోపేతం చేసేందుకు కార్నీ, నేను ఎదురుచూస్తున్నాం. వాణిజ్యం, శక్తి, అంతరిక్షం, కీలక ఖనిజాలు, ఎరువులు మరిన్ని రంగాల్లో పరస్పర సహకారం ఉంటుంది.’ అని పేర్కొన్నారు.  

మెలోని, మేక్రాన్‌తో సరదా సంభాషణ

జీన7 సదస్సు సందర్భంగా ఇటలీ అధ్యక్షురాలు జార్జ్ మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇటీవల ఫ్రాన్స్ ప్రధాని మీద సోషల్ మీడియాలో విపరీత చర్చ జరిగింది. ‘ఎక్స్‌లో బాగా యాక్టివ్‌గా ఉన్నావ్’ అని మోదీ మేక్రాన్‌తో చమత్కరించారు.

నిజ్జర్ హత్య విషయం ప్రస్తావనకు వచ్చిందా? 

ఇరువురు నేతల భేటీ అనంతరం కెనడా ప్రధాని మార్క్ కార్నీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ భేటీలో నిజ్జర్ హత్య విషయం ప్రస్తావనకు వచ్చిం దా అనే ప్రశ్న ఎదురైంది. కార్నీ సమాధానం ఇస్తూ.. ‘చట్టపరమైన అమలు ప్రాముఖ్యతను గురించి మే ము చర్చించుకున్నాం. అంతర్జాతీయ అణచివేతకు పరిష్కారం కను గొనా ల్సిన అవసరం ఉంది. దీనిపై న్యాయ ప్రక్రి య జరుగుతోంది. దీని గురించి మరింత మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.’ అని పేర్కొన్నా రు. జీ లో కెనడా, భారత ప్రధానుల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సమావేశం జరిగిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటనలో పేర్కొన్నారు.