04-06-2025 11:06:18 PM
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట సింగరేణి కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీఆర్ఎస్ నిరాహార దీక్షలో మణుగూరుకు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు(BRS President Rega Kantha Rao) వారిని అభినందించారు. ఆయన వెంట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మిరియాల రాజిరెడ్డి పాల్గొన్నారు.