16-09-2025 12:29:12 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ పరిధిలోని 3 వేల ఎకరాల్లో స్థాపించిన ‘వంతారా’ జంతు సంర క్షణ, పునరావాస కేంద్రానికి సుప్రీం కోర్టు లో ఊరట లభించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారమే వంతారాకు ఏనుగుల ను తరలిస్తే తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
వంతారాకు ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సో మవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యా ప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంక జ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. ‘నిబంధనల ప్రకారమే ఏనుగుల తరలింపు జరిగితే అందులో తప్పులేమీ లేదు.
వంతారాలో ఏనుగులు ఇబ్బందిపడుతున్నాయని పిటిషనర్ పేర్కొం టే, ఆ ఇబ్బందులకు సంబంధించిన ఆధారాలను చూపించాలి. పిటిషన్లో పేర్కొన్న ఆ రోపణలు అస్పష్టంగా ఉన్నాయి. విచారణ ముందుకు సాగాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది’ అని కోర్టు అభిప్రాయపడింది.
వంతారాలోని ఏనుగులను వాటి యజమానులకు తిరిగి అప్పగిం చేందుకు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖ లు చేసిన పిటిషన్ను అస్పష్టంగా ఉందని న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయం పై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రా ష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యే క దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పా రదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా నడచుకుంటుందంటూ నివేదిక ఇచ్చింది. ఆ నివేది కను సర్వోన్నత న్యాయస్థానమూ ఆమోదించింది. అయితే.. ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తు న్న మంచి పనులపై వన్యప్రాణులు, జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధం గా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని, దీని పై దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు.