8 March, 2026 | 3:44 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

డీసీసీ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

26-01-2026 09:55 PM

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.డి అయుబ్, లతో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ కన్నా కలలను నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించాలన్నారు. సమాజంలో నిరక్షరాస్యత, అంటరానితనాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శిలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి అజీజ్ ఖాన్, మున్సిపల్ ఫోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు బొమ్మతి విక్రమ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ శ్రేణులు హనుమకొండ అంబేద్కర్ రాజ్, పోలేపల్లి బుచ్చిరెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.