26-01-2026 10:02:56 PM
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరణ
సనత్నగర్,(విజయక్రాంతి): సనత్నగర్ నియోజకవర్గంలోని సంజీరెడ్డి నగర్లోని గ్రౌండ్లో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవ్ రెడ్డి నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గోదాసి అజయ్ ఆధ్వర్యంలో జెండాను ఎంపీ ఎం.అనిల్కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి భారతీయుని స్ఫూర్తి నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సురేష్ వర్మ,ప్రశాంత్ (టింకూ), ఆకుల వేణునాథ్, హనుమంత్ రావు,వెంకట్ పాశం,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.