03-06-2025 05:12:50 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్లస్టర్ ఏఈఓగా చొప్పదండి తిరుపతి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఒప్పంద ఏఈవో కుమారి అంజలి విధుల కాలపరిమితి ముగిసింది. ఆమె స్థానంలో చొప్పదండి తిరుపతి ఇన్ సర్వీస్ కోటాలో పొలాస వ్యవసాయ కళాశాలలో 4 సంవత్సరాలు B. Sc వ్యవసాయవిద్యను పూర్తి చేసుకొని విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సాగులో మెలుకువలు నేర్పుతూ రైతులకు తన వంతు సేవలు అందిస్తానని తిరుపతి తెలిపారు.