calender_icon.png 5 June, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లస్టర్ ఏఈవోగా చొప్పదండి తిరుపతి..

03-06-2025 05:12:50 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్లస్టర్ ఏఈఓగా చొప్పదండి తిరుపతి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఒప్పంద ఏఈవో కుమారి అంజలి విధుల కాలపరిమితి ముగిసింది. ఆమె స్థానంలో చొప్పదండి తిరుపతి ఇన్ సర్వీస్ కోటాలో పొలాస వ్యవసాయ కళాశాలలో 4 సంవత్సరాలు B. Sc వ్యవసాయవిద్యను పూర్తి చేసుకొని విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎల్లవేళలా  అందుబాటులో ఉండి సాగులో మెలుకువలు నేర్పుతూ రైతులకు తన వంతు సేవలు అందిస్తానని తిరుపతి తెలిపారు.