1 July, 2026 | 8:14 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

రైతుల బకాయిలు చెల్లించాలని సుదర్శన్ రెడ్డికి వినతి

03-12-2025 05:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావుతో కలిసి బుధవారం జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ. 20 కోట్లు బకాయి చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. స్పందించిన సుదర్శన్ రెడ్డి సీఎం పేషిలో మాట్లాడి రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తానని హామీ  ఇచ్చారు