1 July, 2026 | 9:31 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కలెక్టర్ మేడం కనిపించలేదా అక్రమ దుకాణాలు

03-12-2025 05:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు ఆసుపత్రికి వెళ్లే ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు అక్రమ వ్యాపార దుకాణాలు కల్ల సాక్షిగా కనిపించాయి. ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వరకు ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఫుట్ పాత్ లపై అక్రమ వ్యాపార దుకాణాలు రేకుల షెడ్లు తోపుడు దుకాణాలు దర్శనమిచ్చిన ఆమె వాటిని తొలగించేందుకు కనీస ఆదేశాలు ఇవ్వలేదు.

ప్రజల సౌకర్యం కోసం రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఆదేశించినప్పటికీ ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు మున్సిపల్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు ఉన్నారు.