23 March, 2026 | 5:28 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి

23-03-2026 03:58 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిడిపి నాయకులు సోమవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతి పత్రమును అందజేశారు. సర్కిల్ పరిధిలోని ఏదులాబాద్ డివిజన్ పరిధిలో గత నెల రోజుల నుండి మిషన్ భాగీరధ త్రాగునీరు సక్రమంగా సరఫరా జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఎండల తీవ్రత రాకముందే నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఏప్రిల్, మే నెలల్లో ఎండాకాలం పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన కలుగుతున్నదని, గతంలో ఎప్పుడు లేనంతంగా త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. కనుక ప్రధానంగా 6, 7 డివిజన్ ల పరిధిలో త్రాగునీటి ఇబ్బందులు తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు వేముల సంజీవ గౌడ్, శిష్ట సూర్యనారాయణ, పాటి సురేందర్ రెడ్డి, మడ్డి రాములు వినతి పత్రంలో కోరారు.