పెండింగ్ సమస్యలు పరిష్కారించండి
కేఎల్ఆర్కు వివేకానంద కాలనీ వాసుల విన్నతి
బడంగ్పేట్, మార్చి (విజయక్రాంతి) : బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ లోని వివిధ కాలనీ లలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, యువజన కాంగ్రెస్ అధ్యక్షు డు పల్లపు శుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీల వాసులు మంగళవారం మహేశ్వరం కెఎల్అర్ని కలిసి కోరారు.
అదేవిధంగా నాదర్గుల్ - అంబేద్కర్ నగర్ రోడ్డు పను లు మధ్యంతరంలో ఆపివేయడం జరిగింది ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన కె ఎల్ అర్ అధికారులని సంప్రదించి పనులను ప్రారంభించేలా కృషి చేపి స్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసా య మార్కెట్ డైరెక్టర్ గవర్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, నాదర్ గుల్ డివిజన్ కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్, బంగారి అశోక్, మహేందర్ యాదవ్, కుమార్ యాదవ్ , బంగారి మణికంఠ లతో పాటుగా కాలనీ వాసులు పాల్గొన్నారు.




