14-07-2025 12:05:24 AM
ప్రొఫెసర్ ఎల్. వి కే రెడ్డి
సిద్దిపేట, జూలై 13 (విజయక్రాంతి): మనిషికి చదువుతోనే గౌరవం లభిస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎల్ వి కె రెడ్డి తెలిపారు ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో గల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు ద్వారానే సమాజం వికాసం చెందుతుందని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను దగ్గర చేసిందని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ప్రస్తుతం వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 2025 -26 సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని అడ్మిషన్లు వేగవంతం చేయాలని కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం మాట్లాడుతూ ఆగస్టు నెలలో స్టడీ సెంటర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందన్నారు. ఈ స్టడీ సెంటర్ లో చదివిన విద్యార్థులు అందరూ హాజరు కావాలని కోరారు. అనంతరం డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 అడ్మిషన్ల పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై. వెంకటేశ్వర్లు, సీనియర్ కౌన్సిలర్లు ఏం బాలయ్య, జి బాలకృష్ణ, డా. ఎస్ సువర్ణ దేవి పాల్గొన్నారు.