04-06-2025 12:00:00 AM
వనపర్తి, జూన్ 3 ( విజయక్రాంతి ) : వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండ టం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారు.
మంగళవారం ఉదయం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగో లు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొను గోలు కేంద్రాల నిర్వాహకులతో ఏర్పాటు చే సిన సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్, వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూ ల్, వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారు.
వనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే మిల్లింగ్ ఎవ రు చేస్తారని ప్రశ్నించారు. తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుం డా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
డిఫా ల్ట్ మిల్లర్లు పాత సి.యం.ఆర్. ను క్లియర్ చేసి ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోడానికి ముందుకు రావాలని, సి.యం.ఆర్ క్లియర్ చేసిన వారికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. మిల్లర్ల సం ఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావా ల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు.
స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎఫ్. ఎ .క్యూ ప్రకారంగా వడ్లు రావడంలేదని మిల్లర్లు చెప్పడం సరికాదని, కొనుగోలు కేంద్రాలకు ఆధునిక పాడి క్లీనర్లు, ఎండబెట్టే యంత్రాలు, సరిపడా టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచి సరైన తేమ శాతం వచ్చాకే తూకం చేసి మి ల్లులకు పంపించడం జరుగుతుందన్నారు.
వనపర్తి జిల్లాకు మరికొన్ని పాడి క్లీనర్ లు, వాక్యూమ్ పాడి క్లీనర్ లు పంపించడం జరుగుతుందని, తడిచిన ధాన్యం సైతం యం త్రాల ద్వారా ఎండబెట్టి తాలు, చెత్త లేకుండా సరైన తేమతో కొనుగోలు చేసి మిల్లులకు పంపించడం జరుగుతుందన్నారు. యంత్రా ల ద్వారా వరి కోతలు చేసే సమయంలో 18 నుంచి 20 ఆర్పీఎం, గేర్ స్నాట్ బి1 లో ఉంచడం, బ్లొయర్ ఆన్ లో పెట్టుకొని వరి కోతలు చేసేవిధంగా చూడాలని, నిబంధన లు పాటించని హార్వెస్టర్ల పై కేసులు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
సమీక్షలో పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత 10 అవతారాల్లో ఏ రబీ లోనూ లేని విధంగా ఈసారి వనపర్తి జిల్లాలో అత్యధికంగా వరి పండిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి రూ. 571కోట్లు 39145 రైతుల ఖాతాల్లో జ మ చేయడం జరిగిందన్నారు. మొత్తం 415 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా 253 కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు పూర్తి అయిందన్నారు.
మరో 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని తెలియజేశారు. జిల్లాలో 184 మిల్లులకు గాను డిఫాల్ట్ మిల్లులు పోను కేవలం 77 మిల్లులకు మాత్రమే వడ్లు కేటాయించడం జరి గిందని అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందు లు లేకుండా సజావుగా కొనుగోలు చేయ డం జరుగుతుందని తెలియజేశారు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివి ల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జి ల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి. ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.