calender_icon.png 25 June, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకు ఇళ్లు ఇవ్వాలన్నదే సర్కార్ సంకల్పం

04-06-2025 12:00:00 AM

 లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు తావు లేదు 

 610 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

తిమ్మాపూర్ జూన్ 3 విజయ క్రాంతి: అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలన్న సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభు త్వం ముందుకు సాగుతున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్సార్ ఫంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన 610 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూ రు పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఈ విషయంలో ఎలాంటి పైరవీలకు తావు లేదని చెప్పారు. ఇళ్ల మంజూరు ప్రక్రియ ఏటేటా జరుగుతుందని, ఈ దఫా రాని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులకు మరో దఫాలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు.

పేదలకు గూడు కల్పించడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పేదలపట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు ఎందుకు కట్టించి ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నదని ఆయన చెప్పారు. ఇది జీర్ణించుకోలేకనే బీఆర్‌ఎస్ నా యకులు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తప్పుడు ప్రచారం సాగి స్తూ నిరుపేదల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు పూనుకోవాలని, మూడు నెలల్లోగా నిర్మాణాలు చేపట్టని వారి ఇళ్లను రద్దు చేసి మిగితా వారికి ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మి, తహసిల్దార్ విజయ్ కుమార్, హౌసింగ్ ఏఈ దుర్గం మ హేశ్, మానకొండూర్  మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, లతోపాటు పలువురు పాల్గొన్నారు.