calender_icon.png 17 October, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్ఆర్​పై​ రోడ్డు ప్రమాదం

16-10-2025 11:10:36 PM

ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు..

అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సంఘటన..

అబ్దుల్లాపూర్​మెట్: పెద్ద అంబర్​పేట్​ ఔటర్ రింగ్​పై రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలైయిన సంఘటన అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా కొంట మండలం, ఎర్రబోర్​ చెందిన మడ్కందేవా(36) టీఎస్​-12-యూసీ-7847 బోర్​వెల్​ వాహనంపై కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద అంబర్​పేట్​ గ్యారేజీ నుంచి జల్​పల్లి వెళ్తున్న క్రమంలో ఓఆర్​ఆర్​ వాటర్​ ఫాల్స్​ వంతెన వద్ద బోర్​వెల్​ వాహనం ముందు భాగంలో రైట్​సైడ్​ టైరీ పగిలింది. ఇదే బోర్​వెల్​​ సూపర్​వైజర్​గా పనిచేస్తున్నసయ్యద్​ ఫజల్​కు సమాచారమివ్వడంతో ఆయన టీఎస్​–13–యూడీ–2024లో ఆటో ట్రాలీ మరో టైర్​ను తీసుకొచ్చి.. బోర్​వెల్ వెనుక ఆపి టైర్ మారుస్తున్న క్రమంలో ఘట్​కేసర్​ నుంచి బొంగుళూరు వైపు వెళుతున్న ఏపీ–39–యూసీ నెంబర్​ గల మహేంద్ర గుడ్​ వాహనం ఆటో ట్రాలీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టంది.

దీంతో మడ్కందేవాకు తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే మృతి చెందాడు. సూపర్​వైజర్​ సయ్యద్​ ఫజల్​కు మరో వ్యక్తికి సయ్యద్​ ముజ్తాబా గాయాలు కావడంతో వెంటనే హయత్​నగర్​లోని నీలాద్రి దవాఖాను తరలించి ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్​ నగర్​లోని ఓవైసీ దవాఖానకు తరలించారు. ఏపీ రాష్ట్రం కర్నూల్​కు చెందిన మహేంద్ర గుడ్ వాహనం డ్రైవర్​ పాండ్ల నాగరాజు అజాగ్రత్త నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్​ ఇన్​స్పెక్టర్ వి.అశోక్​రెడ్డి తెలిపారు.