09-01-2026 06:56:27 PM
మంథని,(విజయక్రాంతి): న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో మంథని పట్టణంలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని అదనపు జెఎఫ్ సీఎం సుధారాణి, సీనియర్ న్యాయవాదులు చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, హరిబాబు, శశిభూషణ్ కాచె తో పాటు గోదావరిఖని 2-టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్ఐలు శ్రీనివాస్, రవికుమార్, సాగర్ లతో కలిసి అంబేద్కర్ చౌక్, మంథనిలో న్యాయవాదులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలకు రహదారి భద్రత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది సైతం పాల్గొన్నారు.