13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భవిత కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి శారద

09-01-2026 06:54 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం  భవిత కేంద్రం, ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ ను  జిల్లా విద్యాశాఖ అధికారి  శారద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానసిక శారీరక వికలాంగుల పిల్లలకు ప్రత్యేకమైనటువంటి భవిత సెంటర్లో అందరితో పోటు సహిత విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పాటు కాబడిన సుద్దాల గ్రామంలోని సెంటర్లో అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దబడినది. మానసిక వైకల్యం అనేది శరీరానికే కానీ మనస్సుకు కాదని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని జిల్లా విద్యాశాఖ అధికారి శారద కోరారు.

ఈ కార్యక్రమంలో భవితా పిల్లల తల్లిదండ్రులను శాలువతో సత్కరించడం జరిగినది. ఇలాంటి పిల్లలను ఓర్పుతో నేర్పుతో తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లేశం, సీఎమ్ఓ కవితా రెడ్డి, ఎంఈఓ  రాజయ్య, స్కూల్ కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు రత్నాకర్ రెడ్డి, సర్పంచ్ సంపత్ యాదవ్, ఉపసర్పంచ్ గుజ్జ సంపత్, గ్రామ కార్యదర్శి సాగర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.