16 April, 2026 | 12:03 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

అశ్వాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

27-12-2025 09:05 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో డివైడర్ పనులు పూర్తయినా, ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలలుగా రోడ్డును తవ్వేసి వదిలేయడంతో లేస్తున్న దుమ్ము కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు.