18-07-2025 07:09:45 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్ జోన్ పరిధిలోని ఐదు రీజియన్లకు చెందిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లతో శుక్రవారం బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరములో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరము మొదటి త్రైమాసికంలో అన్ని రీజియన్ల పనితీరు, వర్షా కాలం ప్రారంభం అయినందున తీసుకోవలసిన జాగ్రత్తలు, రీజియన్ల నుండి వివిధ పర్యాటక ప్రదేశాలకు నడుపుచున్న టూర్ ప్యాకేజీ సర్వీసులకు ప్రయాణీకుల నుండి లభిస్తున్న ఆదరణను ఆయన సమీక్షించారు.