calender_icon.png 6 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతరకు సర్వం సిద్ధం: ఈవో లావణ్య

06-09-2025 11:37:34 AM

11 రోజు ఫలాలంకణ లో గణనాథుడు 

పటాన్ చెరు,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రుద్రారం ప్రసిద్ధిగాంచిన గణేష్ గడ్డ 11వ రోజు ఫలాలంకణ లో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాలు  కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఉదయం అభిషేకం, పల్లకి సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలం పాట, 6 గంటలకి స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.