04-06-2025 12:20:11 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : నేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పే ర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముం దు ప్రకటించిన అభయహస్తంలో భాగం గా నేతన్నకు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసి నట్టు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 40 వే ల మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని తెలిపారు.
నేతన్న భరోసా పథకానికి బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ ఉన్న మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద ఏడాదికి నేత కార్మికులకు రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల చొప్పున అందించనున్నట్టు చెప్పారు.
చేనే త కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారు చేసిన యూనిక్ లో గోను జతచేస్తామని, తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను, నేత కార్మి కుల వివరాలను వినియోగదారులు తెలుసుకోనే వీలుంటుందని మంత్రి వివరిం చారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులను దేశీ య అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఏర్పడుతాయన్నారు. ఈ పథకం 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులను వరిస్తోంద ని మంత్రి పేర్కొన్నారు.
‘జియో ట్యా గ్ చేసిన మర మగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులు, డై యింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వా రా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం ఆదాయాన్ని పొందుతున్న కార్మికు లు అర్హులు’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ పథకం కింద జియోట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా వార్ప్లలో కనీసం 50 శాతం కం టే ఎక్కువగా పూర్తి చేసిన నేత, అనుబంధ కార్మికులకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వేతన ప్రోత్సాహకం కింద ఏడాదికి రెండుసార్లు డబ్బులు జమ అవుతాయన్నారు.
మొదటి విడత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రెండో విడత అక్టోబర్ నుంచి మా ర్చి నెల వరకు నేత కార్మికుడికి రూ.9 వేల చొప్పున ఏడాదికి రూ.18 వేలు, అనుంబంధ కార్మికుడికి రూ.3 వేల చొప్పున రెం డు విడతల్లో రూ.6 వేలు జమ చేస్తామన్నారు. మొదటి విడతలో 50 శాతం వార్ప్లు పూర్తి చేయనివారు రెండో విడతలో పూర్తి చేసినట్టయితే మొత్తం ప్రోత్సాహకం సంవత్సరాంతంలో అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.