4 April, 2026 | 3:40 PM

Breaking News

రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •  

అంతర్జాతీయ సదస్సులో పాల్గొనున్న సాయికృష్ణ

19-09-2025 12:39 PM

హనుమకొండ(విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) జియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. కే. సాయికృష్ణ ప్రతిష్టాత్మకమైన ఐఐటి మద్రాస్ వారు నిర్వహించిన హిమాలయన్ జియోలాజికల్ ఫీల్డ్ ట్రైనింగ్ కు  ఎంపిక కావడం జరిగింది. ఈ ఐఐటి మద్రాస్ వారు భారతదేశం మొత్తం మీదుగా 20 పరిశోధకులను ఈనెల 20వ తారీకు నుండి 24 తారీకు వరకు లడఖ్ లో జరిగే  ఫీల్డ్ ట్రైనింగ్ కు ఎంపిక చేశారు. డాక్టర్. సాయి కృష్ణ విభాగ అధిపతి అయిన ప్రొఫెసర్. ఆర్. మల్లికార్జున్ రెడ్డి సంరక్షణలో పీహెచ్డీ పొందినారు. ఆ తర్వాత అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్. కే. సాయి కృష్ణ ఇంతకుముందు వివిధ దేశాలలో నిర్వహించిన 5 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్. ఆర్. మల్లికార్జున రెడ్డి మరియు టీచింగ్, పరిశోధక విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అభినందించారు.