22-06-2025 10:57:25 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నృత్య మాల నాట్య కళ వెల్ఫేర్ సొసైటీ(Nritya Mala Natyakala Welfare Society) సిరి ఆరట్స్ అకాడమీ వారు నిర్వహించిన సంగీత కచేరిలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వాసుదేవన సమక్ష నందన్ కు అవార్డు దక్కింది. ‘తందనాన హే భలే తందనాన....‘ బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే.... అనే పాట మీద తన ప్రావీణ్యతను, ప్రతిభను చూపెట్టి అందరి మెప్పు పొందాడు వాసుదేవన సమక్ష నందన్.
బాసర సరస్వతి అమ్మవారికి సంగీత, నృత్య నీరాజనం 2025 అనే టైటిల్ను అవార్డును సమక్షనందన్ కు ముఖ్య అతిథులు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య యాదవ్(Krishnaiah Yadav), న్యూరాలజిస్ట్ యాక్టర్ దైవజ్ఞ శర్మ, రైటర్, సింగర్ అనంత రామకృష్ణ శర్మ, ప్రముఖ సింగర్ వేమూరి మంజుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జిల్లాకే గర్వకారణం.
హైదరాబాదులోని బాచుపల్లి లో సంగీత గురువు మహితారాం ఆధ్వర్యంలో ఈ శిక్షణను సమక్ష నందన్ తీసుకుంటున్నారు. సంగీతంలోనే కాకుండా చెస్, స్విమ్మింగ్, డాన్సింగ్ తదితర కళ్ళలో తర్ఫీదు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఒకటవ తరగతి చదువుతున్నాడు. వాసుదేవన భద్రయ్య-సూచిత వాణిలకు మొదటి సంతానం. నృత్యమాల నాట్య కళ వెల్ఫేర్ సొసైటీ సిరి ఆరట్స్ అకాడమీ డైరెక్టర్ ఆర్గ నైజర్ వీరేష్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీతంలో అవార్డు అందుకున్న సమక్ష నందన్ ను జిల్లాలోని అధికారులు, నాయకులు అభినందించారు.