22-06-2025 11:06:11 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్(Telangana Tahsildar Association) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా కీలక భాధ్యతలను నిర్వహిస్తున్న రమేష్ పాక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ జి. వెన్నెల గద్దర్, తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ పి రామకృష్ణగౌడ్(Telangana Film Chamber Chairman Ramakrishna Goud) చేతుల మీదుగా అదివారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత రోజులో ఒకరికైన ఉపయోగపడాలనే మహత్తర సంకల్పంతో తన వద్దకు వచ్చే వారి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రమేష్ పాక సేవా దృక్పథం ప్రభుత్వం ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను ప్రోత్సహిస్తుందని, విలువలకు ప్రాధాన్యతను ఇచ్చే ఆయన విధానం ప్రజ సేవలో స్పూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారా న్ని అందుకున్న రమేష్ పాకను పలు ఉద్యోగ సంఘాల నేతలు, రెవిన్యూ ఉద్యోగులు తదితరులు అభినందించారు.