14-01-2026 06:08:55 PM
ప్రశాంతవంతమైన వాతావరణంలో పండుగలు
జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ ప్రజలకు శ్రీకాంత్ యాదవ్ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద, ధనిక భేదం లేకుండా ప్రజలు ఆనందోత్సవాల మధ్య, సకుటుంబ సమేతంగా సంతోషంగా సంక్రాంతి పర్యదినాలను జరుపుకోవాలన్నారు. అందమైన రంగవళ్లులతో ఆడపడుచులు ఆకట్టుకోగా, గాలిపటాలు ఎగరవేస్తూ కుటుంబసమేతంగా పండుగను చేసుకోవాలని తెలిపారు. సంస్కృతి, సంప్రాదాయాలను కోపాడుకోవాలని, పండుగలు ఐక్యమత్యాని చాటుతాయన్నారు.