28-05-2025 10:13:33 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం(Kaleshwaram)లో మే 15 నుండి 26 వరకు నిర్వహించిన సరస్వతి పుష్కరాల(Saraswati Pushkaralu)లో రెండు కోట్ల 83 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శనిగరం మహేష్ తెలిపారు. 12 రోజుల్లో జరిగిన సరస్వతి పుష్కరాలలో ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించడం జరిగింది. సరస్వతి పుష్కరాలు 12 రోజులతో సహా మొత్తం 64 రోజులకు గాను 2,83,18651/- రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
పుష్కరాల సందర్భంగా వచ్చిన ఆదాయం ఈ క్రింది విధంగా ఉన్నది.గదుల ద్వారా రూ.171000/-
హోమముల ద్వారా రూ.123000/-
శీఘ్రదర్శనం ద్వారా రూ. 560000/-
ప్రసాదముల ద్వారా రూ.13836552/-
హుండీలాదాయం రూ.13628099/-
మొత్తం 28318651/-
మిశ్రమ బంగారు 15 గ్రాములు
మిశ్రమ వెండి 1 కిలో 750 గ్రాములు వచ్చినది. హుండీల పర్యవేక్షణ అధికారిగా ఇన్స్పెక్టర్ కవిత, ఆలయ సూపరిండెంట్ శ్రీనివాస్, పుష్కర ఉత్సవాల కమిటీ చైర్మన్, సభ్యులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, అన్నమయ్య సేవా ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు కామారెడ్డి, శ్రీ వళ్ళి సేవా ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.