9 May, 2026 | 10:24 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

సార్లు లేరని స్కూల్‌కు తాళం

07-08-2025 01:47 AM

కుభీర్, ఆగస్టు 6: 55 మంది విద్యార్థులకు ఒక్క టీచరే ఉన్నాడని, జిల్లా విద్యా అధికారులు స్పందించి అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్వి లో గ్రామస్థులు, విద్యార్థులు స్కూల్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడిచినా సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించడంలో అధికారులు విఫలమయ్యా రని ఆరోపించారు.

దీంతో పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి లోగా టీచర్లను పంపకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జూన్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మీ పిల్లలను ప్రైవే ట్‌కు పంపొద్దని ఇక్కడే నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి, ఇప్పుడు టీచర్లు నియమించకపోగా తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం, అధికారులు ఆటలాడుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు.