15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కిక్కిరిసిన బుగ్గ దేవాలయం..!

03-11-2025 01:06 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రెండవ కార్తీక సోమవారం అశేష భక్తజనులతో కిక్కిరిసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు శివాలయానికి చేరుకొని రాజరాజేశ్వరునికి భక్తితో మొక్కులు చెల్లించారు. ఉదయం 7 గంటల నుండి శివాలయానికి పోటెత్తారు. రెండవ కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో శ్రీ వాసవి, హనుమాన్ భజన బృందం సభ్యులు భజన పాటలతో ఆధ్యాత్మికతను పెంపొందించారు. మహిళలు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి భారీగా కార్తీకదీపాలను వెలిగించారు. గర్భగుడిలో అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చరణల మధ్య భక్తులు శివలింగానికి జల, క్షీరాభిషేకాలు చేశారు.