calender_icon.png 8 October, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి

08-10-2025 12:05:31 AM

వరంగల్ సీపీ ఎదుట లొంగుబాటు

హనుమకొండ అక్టోబర్ 7 (విజయ క్రాంతి): మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి మంద రూబెన్ మంగళవారం హనుమకొండ పోలీసుల సమక్షంలో లొంగిపోవడం జరిగింది.ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా,హసన్ పర్తి మండలం,వంగపాడు గ్రామానికి చెందిన మంద రూబెన్, అలియాస్ కన్నన్న, అలియాస్ మంగన్న, అలియాస్ సురేష్ 1979 సంవత్సరంలో కాజీపేటలోని  ఆర్. ఈ.సిలో హాస్టల్ మెస్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో రాడికల్స్ యూనియన్స్ నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీమాజీ ప్రధాన కార్యదర్శి, ఒక్కప్పటి ఆర్. ఈ.సి పూర్వ విద్యార్థి నంబాల కేశవరావు పిలుపు నందుకొని మావోయిస్టు పార్టీ లో చేరి ఆజ్ఞతంలోని వెళ్ళిపోయాడు అన్నారు.

1981సంవత్సరం నుండి 1986 వరకు నేషనల్ పార్క్ దళ కమాండర్ లంక పాపిరెడ్డి నాయకత్వం దళ సభ్యుడుగా  కుంట, బస్టర్ ప్రాంతాల్లో పని చేశాడని, 1987లో   మావోయిస్టు పార్టీ నాయకత్వం రూబెన్ ను ఏరియా కమిటీ సభ్యుడిగా అప్పగించడం జరిగింది అన్నారు. 1991లో అనారోగ్యం కారణంగా  చికిత్స కోసం కొత్తగుడెం కు వెళుతున్న సమయంలో చత్తీస్గఢ్  పోలీసులు అరెస్ట్ చేసి జగదల్పూర్ జైలు తరలించగా,ఒక సంవత్సరం అనంతరం రూబెన్ మరో ముగ్గురు ఖైదీలతో కలసి జైలు నుండి తప్పించుకునీ ,1992 లో జైలు తప్పించుకున్న రూబెన్ తిరిగి మావోయిస్టు పార్టీ లో కలిసి ఏరియా కమిటీ సభ్యుడిగా కుంట, అబుజ్ మడ్ ప్రాంతాల్లో 1999 వరకు పని చేశాడన్నారు, ఇదే సంవత్సరంలో సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న గోపన్న నేతృత్వంలో బీజాపూర్ జిల్లా, గుండ్రాయి గ్రామానికి చెందిన పొడియం భీమే తో రూబెన్ కు వివాహం జరిగిందన్నారు.

2005 సంవత్సరం డివిజన్ కమిటీ సభ్యుడి పనిచేస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా పార్టీ ఆదేశాలతో రూబెన్ గుండ్రాయి గ్రామంలోనే భార్య, పిల్లలతో నివాసం వుంటూ, కోళ్లు, గొర్రెలు ఫారాలు నిర్వహిస్తూనే స్థానిక గ్రామ కమిటీలతో కలసి చురుకుగా పని చేసే వాడు, ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ నాయకులతో పాటు దళ సభ్యులకు షెల్టర్, భోజన వసతులను కల్పిస్తూనే పోలీసుల కదలికలను గమనిస్తూ మావోయిస్టులకు సమాచారం అందిస్తూ మావోయిస్టు పని చ చేసేవాడు.  అనారోగ్యం బాధపడుతున్న రూబెన్, ఉద్యమంలో పాల్గోడంలో శరీరం సహకరించకపొవడం.ముఖ్యంగా మావోయిస్టు సిద్దాంతాలకు కాలం చెల్లిపోవడం, ప్రజలకు మావోయిస్టులపై వ్యతిరేకత రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పురావాస పథకాల ద్వారా ప్రశాంతవంతమైన వాతావరణంలో తన కుటుంబ సభ్యులతో జీవించాలని, నిర్ణయించుకొని పోలీసుల ఎదుట  రూబెన్ లొంగిపోవడం  జరిగిందని సీపీ తెలియజేశారు.

రూబెన్ పాల్పడిన నేరాల వివరాలు...

దళ సభ్యుడిగా పనిచేసే సమయంలో పెద్ద కెడు వాల్,పండోడు,పిడిమాల్,బండారిపాడు గ్రామాలకు చెందిన గ్రామస్తులను దళ సభ్యులతో కలసి హత్యలు చేయడంతో పాటు, ఎలమకొందా గ్రామ సర్పంచ్ ను హత్య చేసిన సంఘటనల్లో నిందితుడు. 1988లో గొల్లపల్లి-మారాయి గూడ మార్గం లో పోలీసుల కాన్వాయి పై మావోయిస్టుల కలసి 20 మంది సి. ఆర్. పై. ఎఫ్ పోలీసులను దారుణంగా హత్య చేసి వారి ఆయుధాలను పట్టుకొని పోయిన సంఘటనలో నిందితుడు 1990లో  సెంట్రల్ కమిటీ సభ్యుడు గోపన్నతో కలసి తుర్లపాడు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటన లో రూబెన్ నిందితుడు, ఇతని పై 8లక్షల రూపాయల రివార్డ్ వుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.