12 August, 2026 | 12:19 AM

సికింద్రాబాద్ పాస్‌పోర్టు కేంద్రానికి సీఎం రేవంత్

13-07-2024 12:50 AM

పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్న సీఎం

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకోవడానికి శుక్రవారం సికింద్రా బాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాల యం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.