15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలి

22-12-2025 02:51 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్

ఖానాపూర్,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని ఎటువంటి అభివృద్ధి పనులైన తన దృష్టికి తీసుకురావాలని డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్, పెంబి, కడం, దస్తురాబాద్ మండలాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణస్వీకారాలకి హాజరై ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పలువురు సర్పంచులకు తగు దిశా నిర్దేశం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అందుకు తగ్గట్టుగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మేరకు మస్కాపూర్, పెంబి, తర్లపాడు, అనంతరం అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు.