10 May, 2026 | 12:36 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

భద్రకాళి దేవాలయంలో ఘనంగా శాకాంబరి వేడుకలు

01-07-2025 12:31 AM

వరంగల్ (మహబూబాబాద్), జూన్ 30 (విజయ క్రాంతి) : వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ‘విరోధిని’ గాను షోడశీ క్రమాన్ని అనుసరించి ‘వహ్నివాసిని’ గా అంకరించి పూజారాధనలు నిర్వహిం చారు.

విరోధిని నిత్య అమ్మవారు భక్తులకు శత్రు విజయము కలిగించును. వహ్నివాసిని కర్మఫలప్రాప్తి కలిగించుటయేగాక ఐశ్వర్యాభి వృద్ధి కల్గించునని ఆలయ ప్రధానార్ధకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి వసతి, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, నార్ల సుగుణ, ఈఓ శ్రీమతి శేషుభారతి పర్యవేక్షిం చారు.

శ్రీ మాతా,లలితాంబికా సేవా సమితి వారి ఆధ్వర్యవములో వరంగల్ మహా నగరంలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్లోని పలు ప్రాంతాలకు చెందిన నారీమణులు ఆషాడ శుద్ద పంచమి పురస్కరించుకొని వందలాదిగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు.

పంచమి తిథి కావడంతో పంచమీ పంచభూతేషి పంచతన్మాత్రసాయికా అని లలితా సహస్రనామ ప్రమాణం, పంచభూ తములకు ఈ జగన్మాతయే అధినాయకి, ఈ రోజు అమ్మవారికి సారె సమర్పించడవం వల్ల పంచభూతములకు ప్రీతి కలిగి ప్రకృతి సమతౌల్యం కలిగి ఉండి ప్రాణి కోటి సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముత్తయిదువులు అమ్మవారికి సారె సమర్పిస్తారని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.