19-03-2025 12:31:13 AM
రాజేంద్రనగర్, మార్చి 18 (విజయ క్రాంతి): శంషాబాద్ ఏసీపి కే. శ్రీనివాసరావుకు ప్రమోషన్ వచ్చింది. ఆయనకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. చాలా రోజులుగా శంషాబాద్ ఏసీపీ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు తనదైన శైలిలో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు..