25-06-2025 02:51:11 PM
న్యూఢిల్లీ: శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రోదసీ యాత్ర బుధవారం ప్రారంభం అయింది. కెప్టెన్ శుభాంశు శుక్లా బృందం సరికొత్త చరిత్ర సృష్టించందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అన్నారు. భారత్ అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుందని తెలిపారు. శుభాంశు శుక్లా రోదసీయాత్ర పట్ల దేశం ఉద్విగ్నభరితంగా ఎదురుచూచిందని స్పష్టం చేశారు.
ఐఎస్ఎస్ లోకి శుభాంశు శుక్లాతో పాటు అమెరికా, పోలండ్, హంగేరి వ్యోమగాములు వెళ్లారని చెప్పారు. 4 దేశాల వ్యోమగాముల ప్రయాణం వసుధైన కుటుంబాన్ని నిరూపించిందని రాష్ట్రపతి వెల్లడించారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక నింగిలోకి ఎగిరింది. రేపు సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్ష కేంద్రంలో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకునేందుకు 28 గంటల సమయం పడుతోంది. యాక్సియం-4 మిషన్ కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఫైలట్ గా ఉన్నారు. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు.