22 May, 2026 | 7:12 PM

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సైకి సన్మానం

22-05-2026 06:20 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ని మఠంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి ప్రాంతంలో గల సమస్యలను ఎస్సై దృష్టికి తేవడం జరిగినది,ముఖ్యంగా కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు గురించి చర్చించి ఎస్సై దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. యువతడ్రగ్స్ బారినబడి తమ జీవితాలను బలి చేసుకుంటున్నారని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి ను  సమాజంలో సమూలం గా నిర్మూలించే కార్యక్రమం లో భాగంగా తమ వంతు కృషిగా చట్టానికి సహకరిస్తామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు.