07-09-2025 05:50:35 PM
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35% వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తయినప్పటికీ లాభాల వాటా ప్రకటించక పోవడం దుర్మార్గం అన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికల కోడ్ అమలు అయితే కార్మికుల లాభాల వాటా చెల్లించడం మరింత ఆలస్యం అవుతుందని వెంటనే గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 35% వాటా చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు చేపడుతున్న కార్యక్రమాలను ఓర్వలేని కొన్ని కార్మిక సంఘాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ కార్మికులను ప్రక్క తోవ పట్టిస్తున్నారని కార్మికులు వీరి మాటలు నమ్మవద్దని కోరారు. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ రంభ ఊర్వశి ల పేరిట కార్మికుల సమస్యలు కించ పరిచే విధంగా మాట్లా డడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు 35% లాభాల వాటా చెల్లించాలని, పేర్క్స్ పై ఇన్కంటాక్స్ మినయించాలని, మారు పేర్లు సరి చేయాలని, క్లరికల్ ఎగ్జామ్ ను త్వరగా నిర్వహించాలని, ట్రాన్స్ఫర్ పాలసీని మార్చాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాలను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు రామగిరి రామస్వామి, రమేష్, కే సంజీవ్, డి సురేష్, మల్లేష్ కుమారస్వామి, తాజుద్దీన్, ఎన్ శ్రీధర్, ఆదర్శ్ లు పాల్గొన్నారు.