calender_icon.png 6 June, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి మ్యూజియంను ఏర్పాటు చేయాలి

04-06-2025 09:00:39 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ఏరియాలో సిరులవల్లి సింగరేణి చరిత్రకు సంబంధించిన ఓ సింగరేణి మ్యూజియంలను ఏర్పాటు చేయాలని క్యాతన్ పల్లి మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల ఐక్య వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్ రావు(President Gurajala Ravinder Rao) అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఘనతను తెలిపేందుకు మ్యూజియం ఏర్పాటు కీలకం అని అన్నారు. సింగరేణి చరిత్రను భావితరాలకు తెలియజేయడం సులభంగా అర్థం అవుతుందని గురజాల రవీందర్ రావు అన్నారు.

కొత్తగూడెం నుండి మొదలు బెల్లంపల్లి వరకు కనీసం మూడు సింగరేణి మ్యూజియంలు ఏర్పాటు చేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. అలాగే ఓ మొబైల్ మ్యూజియంను ఏర్పాటు చేయడం వల్ల సింగరేణి ఘనతను,అప్పటి ట్రేడ్ యూనియన్ల నాయకత్వాన్ని,కార్మికుల పనితీరును ఊరరా తెలియజేయడం చాలా సులభతరం అవుతుందని అన్నారు.త్వరలోనే సింగరేణి సీఅండ్ఎండి బలరాం నాయక్ ను కలిసి సింగరేణి మ్యూజియం ఏర్పాటు చేసేలా మెమరండం అందించి వివరిస్తామని అన్నారు.