calender_icon.png 6 June, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనలో నెరవేరుతున్న పేదల సొంతింటి కల

04-06-2025 08:58:39 PM

జగ్గయ్య పల్లెలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ..

హుజురాబాద్ (విజయక్రాంతి): గత పది సంవత్సరాలుగా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని దశాబ్ద కాలంగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రజా పాలనలో వారి కలను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు పరశురామారావు(Mandal President Parasurama Rao) వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నాయినేని రాజేశ్వరరావు(Agricultural Market Director Nayineni Rajeswara Rao) అన్నారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండల్  బుధవారం జగ్గయ్యపల్లి గ్రామంలో అర్హులైన 9 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు కూడా అధైర్య పడవద్దని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందని అన్నారు.

హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి జగ్గయ్యపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజా దేవి గ్రామపంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి ప్రదీప్ నాయకులు బాబురావు రవీందర్ ఆదిత్య అజయ్ అరవింద్ రాజు సాయి సుమన్ తదితరులు పాల్గొన్నారు.