27-11-2025 01:36:18 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ..
కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్..
రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు..
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ మళ్లీ విచారణ ప్రారంభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు.