09-06-2025 03:07:36 PM
తెలంగాణలో పెరిగిన బస్ పాస్ ఛార్జీలు
హైదరాబాద్: ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ(Telangana State Road Transport Corporation) సోమవారంనాడు భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను(Bus Pass Charges) పెంచింది. బస్ పాస్ రేట్లను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం(RTC management) ప్రకటించింది. బస్ పాస్ ధరలను 20శాతం పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. పాస్ ధరలు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రజల మీద భారం వేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆర్డినరీ పాస్ ధర రూ. 1,150 నుంచి రూ.1,400 పెంపు
మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ రూ. 1,300 నుంచి రూ. 1,600 పెంపు
మెట్రో డీలక్స్ పాస్ రూ. 1,450 నుంచి రూ, 1,800 పెంపు