కన్నుల పండుగగా శ్రీ సీతరాముల కళ్యాణం
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాలు రాముని ఆలయాల్లో ఉదయం నుండి పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్తులు గ్రామాల్లో ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. చామనపల్లి వడ్యాల్ పిచర పార్పెల్లి టైగర్ గ్రామాల్లో వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీ సందర్భంగా చామనపల్లి ఆలయానికి భక్తుల పెద్ద ఎత్తున తరలివచారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు. అయిట్ల లక్ష్మి సుదర్శన్ పసుపుల నరేష్ అబ్బటి పుష్ప రాజేశ్వర్ ఉప ఉప సర్పంచ్ లు విద్యాసాగర్ రెడ్డి రవీందర్ గంగారెడ్డి వీడిసి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




