2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ప్రజావాణికి 611 దరఖాస్తులు

04-09-2024 01:22 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 611 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి 149, బీసీ సంక్షేమం 123, మైనార్టీ శాఖ 94, విద్యుత్ శాఖకు 57, రెవెన్యూ శాఖ 54, ఇతర శాఖలకు 134 దరఖాస్తులు అందినట్లు వెల్లడిం చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి, ప్రజాపాలన అధికారి దివ్య దేవరాజన్  కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.